డబ్బు అందిరికీ ఉంటుంది..! కానీ సాయం చేసే మనసు కొందరికే ఉంటుంది..! కరోనా నేపథ్యంలో సినీనటుడు సోనూసూద్ చేసిన సేవల్ని యావత్ ప్రపంచం కొనియాడింది.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. రీల్ విలన్ కాస్త రియల్ హీరోగా గుర్తింపు పొందాడు.. మొన్న కరోనా సమయంలో పేదల పాలిట దేవుడు..! నిన్న పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్..! నేడు పేదవారికి ఉపాధి కల్పించడం కోసం మరో అడుగు ముందుకు వేశాడు..!
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఎలక్ట్రిక్ రిక్షాలు ఇవ్వనున్నట్లు సోనుసూద్ తెలిపాడు.. “ఖుద్ కమావో, గేర్ చలావో” పేరుతో ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించినట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు..
భారతదేశంలో రోజు రోజుకి వాయు కాలుష్యం పెరుగుతుంది.. దీని వల్ల గాలిలో నాణ్యత క్షీణిస్తుంది..! పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది..పెట్రోల్ డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడుకలోకి వస్తున్నాయి.. యుపి టెలిలింక్స్ లిమిటెడ్ లి-అయాన్ పేరుతో ఎలక్ట్రిక్ రిక్షాను భారత మార్కెట్లో విడుదల చేసింది.. కరోనా సమయంలో జీవనోపాధి కోల్పోయిన పేదలకు “లి-అయాన్” రిక్షా లను అందించి మరల తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది..
ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ధర రూ.1.85 లక్షలు. ఈ రిక్షాకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా2 పథకం కింద అ 37,000 సబ్సిడీ లభిస్తుండటం గమనార్హం. దీని ఆకర్షణీయమైన డిజైన్, చూడడానికి హుందాగా, మూడు సంవత్సరాల వారంటి తో లభిస్తుంది. ఎలక్ట్రిక్ రిక్షా ఒక కిలో మీటర్ కు నడవడానికి కేవలం 30 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ రిక్షా లిథియం అయాన్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయిన తర్వాత 100 కిలోమీటర్లు నడుస్తుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!