రోజురోజుకి సైబర్ నేరాలకు అంతు లేకుండా పోతుంది..! ఒక్క చిన్న లింక్పై క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో డబ్బులు మాయమవుతున్నాయి..!ఎవరు చేసారో కూడా తెలియని విధంగా ఉంది ఈ వింత ఆట..! ప్రస్తుతం ఈ సైబర్ నేరాలకు కొత్త కొత్త పద్దతులతో జనాలను ఆశ్చర్యపరిచే విధముగా ఆఫర్ అన్న లింక్స్ పంపడంతో అమాయక ప్రజలు మోసపోతున్నారు..! ఈ నేపథ్యంలో జరిగిన బెంగుళూరు చెందిన మహిళ ఆఫర్ అంటూ ఒక లింక్ పై క్లిక్ చేసి ఎంత మొత్తం పోగొట్టుకుందో చూడండీ..!
బెంగళూరుకు చెందిన సవిత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసింది.. ఫుడ్ ఆర్డర్ చేసిన ఆమెకు సైబర్ నేరగాళ్ళు రూ.10 ఆఫర్ అంటూ ఒక లింకు పంపారు.. ఆ ఆఫర్ నిజమేనేమో అనుకొని ఆ లింక్పై క్లిక్ చేసింది. వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుండి 50,000 కట్ అయినట్టుగా మెసేజ్ రావటం తో లబోదిబోమంది.. వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ ను సంప్రదించగా తాము ఎలాంటి మనీ తీసుకోలేదని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్రమత్తమైన కర్ణాటక పోలీసులు సైబర్ ముఠాను పట్టుకున్నారు.