Mugguru Monagallu: శ్రీనివాస్ రెడ్డి ఒక వైపు కమెడియన్ గా చేస్తూనే.. మరో వైపు కథానాయకుడిగా నటిస్తున్నారు.. శ్రీనివాస్ రెడ్డి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా ముగ్గురు మొనగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..!! తాజాగా ముగ్గురు మొనగాళ్లు సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్..!!
ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు దారులుగా కనిపించనున్నారు.. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి ఒకే పోస్టర్ లో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. పోస్టర్ లో కనిపించినట్లుగా ముగ్గురు మొనగాళ్ళు లో శ్రీనివాస్ రెడ్డికి వినపడదు.. దీక్షిత్ మాట్లాడలేడు.. రామారావు కి కనపడదు.. ఇలా ఈ ముగ్గురు మొనగాళ్లు సినిమా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.