Facebook: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది.. తమ ఉద్యోగులు కావాలంటే శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎంచుకోవచ్చని ఫేస్ బుక్ ప్రకటించింది.. జూన్ 15 నుండి రిమోట్ గా ఉద్యోగం చేయాలనుకునే ఉద్యోగి అయినా పర్మినెంట్ గా వర్క్ ఫ్రం హోం చేసుకునేలా అనుమతిస్తున్నట్లు తెలిపింది.. అంతేకాకుండా కరోనా కారణంగా ఉద్యోగులు ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే అందుకు కావలసిన సహాయం చేస్తామని కూడా ఫేస్ బుక్ ప్రకటించింది..
Read More: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమల కొండపై వసతి గదులు సులభంగా పొందండిలా..
“మనం ఎక్కడ నుంచి పని చేస్తున్నాము అనేదానికంటే.. ఎలా చేస్తున్నామనే విషయమే ముఖ్యం.. చక్కగా పని చేసే ప్రదేశంలో తమ ఉద్యోగులు ఉండాలని భావిస్తున్నట్లు” ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. మంచి పని ఎక్కడైనా చేయవచ్చని గత సంవత్సరం అనుభవం నేర్పిందని.. దీంతో పనిచేసే ప్రదేశం కంటే పని చేసే విధానమే ముఖ్యమైనదని తాము విశ్వసిస్తున్నామని ఫేస్ బుక్ తెలిపింది. రిమోట్గా పనిచేసే ఉద్యోగుల కోసం వ్యక్తిగతంగా సమావేశాలను నిర్వహించాలని ఆలోచిస్తోంది 2020లో ఫేస్బుక్ కొంత మంది ఉద్యోగులను ముఖ్యంగా అత్యంత సీనియర్ అనుభవజ్ఞులైన ఉద్యోగులను శాశ్వత రిమోట్ గా పని చేసుకోవచ్చు అని ప్రకటించింది. తాజాగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఫుల్ టైం ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేసుకోవచ్చని వెల్లడించారు.
సంవత్సరన్నర కాలంగా మూసి వుంచిన ఫేస్బుక్ కార్యాలయాలను తెరుస్తోంది. తిరిగి వచ్చే ఉద్యోగులకు టైం షెడ్యూల్ సరళంగా ఉంటుందని తెలిపారు. జూన్ 15 నాటికి పలు దేశాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు దీనిపై తమ విధానాన్ని ప్రకటించాయి..