Gastric problem: ఆధునిక జీవన విధానంలో మారిన ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్నారు.. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆకలి వేయకపోవడం, చాతిలో మంట ఇవన్నీ గ్యాస్ట్రిక్ లక్షణాలు కడుపులో ఆమ్లాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, సరిగా నిద్ర లేకపోవడం, మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది.. వంటింటి చిట్కాల తో గ్యాస్ ట్రబుల్ కు చెక్ పెట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Read More: Yami Gautam: యామి గౌతమ్ పెళ్లి ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్..
* నిమ్మకాయలో జీర్ణక్రియను మెరుగుపరిచి గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ పుదీనా రసం, ఒక స్పూన్ అల్లం రసం వీటన్నింటికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపు నొప్పి సమస్య నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
*యాలుకలు, సొంఠి, ఇంగువ, సైంధవలవణం అన్ని ఒక స్పూన్ చొప్పున తీసుకొని మెత్తని పొడి లా చేసుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి త్వరగా రిలీఫ్ ఇస్తుంది.
*బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది.
*ఒక స్పూన్ తేనెకు, అర స్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండుపూటలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.
*గ్లాసు నీటిలో చెంచా దాల్చిన పొడి వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని తాగితే కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.
*బొప్పాయి ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తగా పొడిలా చేసి రోజూ అర స్పూన్ పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం వంటి ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి.
*జీలకర్ర, పంచదార ను మామిడి తిన్న మంచి ఫలితం ఉంటుంది.
*తులసి పుదీనా ఆకులను కలిపి నమిలితే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
* కొద్దిగా జీలకర్ర పొడిని గ్లాసు మజ్జిగలో కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.