MaheshBabu – Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే.. మహేష్ కెరీర్ లో 28వ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమా కు పార్ధు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.. మరోవైపు ఈ సినిమా కు సంబంధించి రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు క్లాసిక్ లు గా నిలిచాయి.. దీంతో మరో క్లాసిక్ సినిమా రానుందంటూ అభిమానులు అంటున్నారు.. 11 సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ ని పూర్తి డిఫరెంట్ రోల్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఈ సినిమాకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది..
ప్రస్తుతం మహేష్ బాబు గీతగోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!