Nikhil Siddhartha: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోందని దాన్ని అధిగమించాలంటే అందరూ ఒకరికొకరు సాయం చేసుకోవాలని హీరో నిఖిల్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. తాజగా హీరో నిఖిల్ ట్యాగ్ చేస్తూ ఒక వ్యక్తి గ్రామీణ కార్మికులకు పంచడానికి హైజిన్ కిట్స్, ఓరల్ ప్యాకెట్స్, విటమిన్ సప్లిమెంట్స్ అందిస్తారా అని కోరగా.. వెంటనే నిఖిల్ స్పందించి అందుకు కావలసిన డబ్బును వెంటనే పంపిస్తాను.. వారికి అందించండి అని తెలియజేశారు..
హీరో నిఖిల్, తన మిత్రులు, ఎన్జీవోల ద్వారా తనకు తోచిన సహాయం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది ఏ మాత్రం సరిపోవడం లేదని తెలిపారు. కళ్ళముందే ఎన్నో ప్రాణాలు పోతున్నాయని ఇటీవల ఒక వీడియోలో బాధ పడిన విషయం అందరికీ తెలిసిందే.. అంతేకాకుండా మనల్ని ఎవరూ వచ్చి కాపాడుతారు అనుకోవడం జరగని పని అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వేరే వాళ్లకు మానవత్వంతో సహాయం చేసే వాళ్ళని చూసి ఆనందం కలుగుతుందని.. ప్రతి ఒక్కరూ కూడా పక్క వాళ్లకు సాయం చేయాలని కోరారు..
Will send u the Required Amount of money..
You volunteer, buy & distribute to the Workers there ?? #CovidHelp #COVID19 https://t.co/lpUlaxlQrC— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2021