Rashmika: కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పలేదు.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు నేషనల్ క్రష్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు.. రష్మిక కూడా తన అభిమానుల పై అంతే ప్రేమ చూపిస్తోంది.. ఇటీవల సోనూసూద్ ని చూడడం కోసం ఓ అభిమాని నడుచుకుంటూ వెళ్ళాడు.. ఇప్పుడు ఒక అభిమాని రష్మీక ని చూడటం కోసం 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు..!! ఇంతకీ ఈ అభిమాని కన్నడ బ్యూటీ ని కలుసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..!!
తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి తన అభిమాన హీరోయిన్ రష్మిక చూసేందుకు చూడాలని నిశ్చయమయ్యడు. వెంటనే గూగుల్ మ్యాప్ ద్వారా రష్మిక స్వస్థలం తెలుసుకుని ఎట్టకేలకు కర్ణాటకలోని కొడగు జిల్లా కు చేరుకున్నాడు. అక్కడ ఆమె నివాసం స్థలం తెలుసుకునేందుకు కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగారు. కన్నడ అతనికి మాట్లాడం రాక కనిపించిన వారందిని అడగడంతో.. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులను పిలిపించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగా తన అభిమాన హీరోయిన్ రష్మిక ఒకసారి చూసి వెళ్తానికి వచ్చినట్లు తెలియజేశాడు. పోలీసులు అసలే ఇది కరోనా టైంలో ఇంతదూరం ప్రయాణించడం మంచిది కాదు. వెళ్ళిపోమని చెప్పారు హీరోయిన్ హైదరాబాద్ వచ్చినప్పుడు కలుసుకోవాలి అతనిని వెనక్కి పంపించారు. ప్చ్.. దీంతో తన అభిమాన నటిని చూడకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన రష్మిక మందన పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!