SBI Alert: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.. ఇటీవల సేవింగ్స్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలు సవరించిన సంగతి తెలిసిందే.. తాజాగా పాన్ కార్డు కు ఆధార్ కార్డ్ జూన్ 30 లోపు లింక్ చేసుకోవాలని సూచించింది.. ఈ విషయాన్ని ఎస్బిఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది..
Read More: Nikhil Siddhartha: నిఖిల్ బర్త్ డే కిర్రాక్ అప్డేట్స్
“ఖాతాదారులు ఎటువంటి ఆటంకం లేని ఎస్బిఐ సేవలను పొందాలంటే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి” అని ట్వీట్ లో స్పష్టం చేసింది. పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ పని చేయకుండా పోతుంది అని భవిష్యత్తులో లావాదేవీలను నిర్వహించడానికి కష్టమవుతుందని వివరించింది. పాండు ఆధార్ తో లింక్ చేయడానికి 30 జూన్ 2021 చివరి తేదీ. incomtaxindiaefiling.gov.in సైట్ లోకి వెళ్లి ఇంట్లోనే లింక్ చేసుకోవచ్చు..