Shaakuntalam: సమంత అక్కినేని ప్రధాన పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం.. సమంత కెరీర్ లో తొలిసారిగా పౌరాణిక పాత్రలో నటిస్తోంది.. ఇటివల ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఆగిపోయింది ఈ సినిమా షూటింగ్. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!!
ఈ చిత్రంలో దుష్యంతుడు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఇస్తూ అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కొడుకు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభిరామ్, అల్లు అర్జున్ కొడుకు అయాన్ లలో ఎవరో ఒకరి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు..
The second schedule of #Shaakuntalam begins?#EpicLoveStory ?@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @DilRajuProdctns @GunaaTeamworks pic.twitter.com/LbZLBQPxq1
— BARaju's Team (@baraju_SuperHit) June 28, 2021